సింగరేణి ప్రైవేటీకరణకు ఆ రెండు పార్టీలు కుట్ర

  • 2 days ago
BRS Leader KTR on Singareni Coal Mines Privatization : తెలంగాణ గొంతుకు పార్లమెంటులో లేదన్న భ్రమతోనే కాంగ్రెస్​, బీజేపీ కలిసి సింగరేణి ప్రైవేటీకరణ కోసం కుటిల ప్రయత్నం చేస్తున్నాయని బీఆర్​ఎస్​ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​ మండిపడ్డారు. సింగరేణి ప్రైవేటీకరించేందుకే కేంద్రం తెలంగాణ బొగ్గు గనులను వేలం వేసిందని ఆరోపించారు. సింగరేణి ప్రాంత మాజీ ఎమ్మెల్యేలు, నాయకులు, బొగ్గు గని కార్మిక సంఘం నాయకులతో ఆయన హైదరాబాద్​లోని తెలంగాణ భవన్​లో సమావేశమయ్యారు. ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ధ్వజమెత్తారు.