పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి ఓ బాలికను ట్రాప్ చేసిన కానిస్టేబుల్, పలుమార్లు తనపై అత్యాచారానికి పాల్పడ్డాడు. గట్టిగా ప్రశ్నించేసరికి తీరా ముఖం చాటేశాడు. ఈ ఘటన రాజేంద్రనగర్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సదరు బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడ్ని అరెస్ట్ చేశారు.