సీతారామ ప్రాజెక్టు తొలి పంప్​హౌస్​​ ట్రయల్ రన్ విజయవంతం - భావోద్వేగానికి గురైన తుమ్మల

  • 11 days ago
Seetharama Project Motor Trail Run Successful : సీతారామ ప్రాజెక్టులో కీలకమైన తొలి పంప్​హౌస్​ ట్రయల్ రన్ విజయవంతంగా పూర్తయింది. కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లోని సూమారు 9 లక్షల ఎకరాలకు సాగు నీరందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ ప్రాజెక్టును చేపట్టింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలోని బిజీ కొత్తూరు వద్ద నిర్మించిన మొదటి పంపు హౌజ్ ట్రయల్ రన్​ను బుధవారం అర్ధరాత్రి చేపట్టారు. నీటిపారుదల శాఖ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులుస రైతుల సమక్షంలో ట్రయల్ రన్ నిర్వహించగా పంప్ హౌజ్ నుంచి గోదావరి జలాలు ఎగిసిపడుతూ దిగువకు పారడంతో అధికారులు సంబరాల్లో మునిగితేలారు.