సీతారామ ప్రాజెక్టు తొలి పంప్హౌస్ ట్రయల్ రన్ విజయవంతం - భావోద్వేగానికి గురైన తుమ్మల
- 11 days ago
Seetharama Project Motor Trail Run Successful : సీతారామ ప్రాజెక్టులో కీలకమైన తొలి పంప్హౌస్ ట్రయల్ రన్ విజయవంతంగా పూర్తయింది. కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లోని సూమారు 9 లక్షల ఎకరాలకు సాగు నీరందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ ప్రాజెక్టును చేపట్టింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలోని బిజీ కొత్తూరు వద్ద నిర్మించిన మొదటి పంపు హౌజ్ ట్రయల్ రన్ను బుధవారం అర్ధరాత్రి చేపట్టారు. నీటిపారుదల శాఖ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులుస రైతుల సమక్షంలో ట్రయల్ రన్ నిర్వహించగా పంప్ హౌజ్ నుంచి గోదావరి జలాలు ఎగిసిపడుతూ దిగువకు పారడంతో అధికారులు సంబరాల్లో మునిగితేలారు.