మాట తప్పిన జగన్​- ఇబ్బందుల్లో అన్నదాతలు

  • 11 days ago
YSRCP Government has Not Paid Grain Dues to Farmers: రైతు భరోసా కేంద్రాల ద్వారా అన్నదాతల సమస్యలు పరిష్కరిస్తాం. ధాన్యం కొనుగోలు చేసిన 21 రోజుల్లోనే బకాయిలు చెల్లిస్తాం. అధికారంలో ఉన్నప్పుడు జగన్‌ చెప్పిన కల్లబొల్లి కబుర్లు ఇవి. ఎన్నికల ఫలితాల ప్రకటనకు ముందు వరకూ కోట్లాది రూపాయలను తన అనుయాయులైన గుత్తేదారులకు చెల్లించిన జగన్ అన్నదాతలకు మాత్రం మొండిచేయి చూపారు. ఫలితంగా ఖరీఫ్ ఆరంభమైనా పెట్టుబడులు పెట్టేందుకు డబ్బులు లేక మళ్లీ అప్పులు చేసే ధైర్యం లేక రైతులు దీనస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.