Officials Not Released Water to KC Canal: ఖరీఫ్ కోసం నెల రోజుల నుంచే రైతులు పొలాలు సిద్ధం చేసుకున్నారు. కానీ సకాలంలో నీరు విడుదల చేయకపోవడంతో కర్నూలు, వైఎస్సార్ జిల్లాల రైతన్నలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సుంకేసుల డ్యాంలో నీరు ఉన్నా కేసీ కెనాల్కు అధికారులు విడుదల చేయలేదు. రోడ్డు పనుల కోసమే నీరు విడుదల చేయట్లేదని అన్నదాతలు ఆరోపిస్తున్నారు.