Industries Minister TG Bharath About Land Rates in State : తమిళనాడుతో పోలిస్తే ఏపీ ఐఐసీ కేటాయిస్తున్న భూమి విలువలు ఏపీలో చాలా తక్కువ ఉన్నాయని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ శాసనసభకు వివరించారు. వెయ్యి కోట్లకు పైబడిన పెట్టుబడులు ఉంటే అతి తక్కువ రేటుకే భూములు కేటాయిస్తున్నామని మంత్రి తెలిపారు. కృష్ణా జిల్లా మల్లవెల్లి లోనూ అతితక్కువ ధరకు మాత్రమే భూములు కేటాయిస్తున్నామని వెల్లడించారు. అయితే దీనిపై స్పందించిన సర్వేపల్లి శాసన సభ్యుడు సోమిరెడ్డి ఇతర రాష్ట్రాల్లో పరిశ్రమలకు కేటాయిస్తున్న భూముల ధరలు చాలా తక్కువ ఉంటున్నాయని రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గానికి ఓ పారిశ్రామిక వాడ పెట్టాలని నిర్ణయించిన తరుణంలో భూముల ధరల్ని మరోమారు సమీక్షించుకోవాల్సి ఉందని సోమిరెడ్డి స్పష్టం చేశారు.
Category
🗞
News