దుర్గమ్మకుపట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎందంపతులు
Minister Anam Review on Mulanakshatram Arrangements: మూలానక్షత్రం రోజున విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మకు సీఎం చంద్రబాబు దంపతులు పట్టువస్త్రాలు సమర్పిస్తారని దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. ఈ సమయంలో ఎవరికీ ప్రత్యేక దర్శనాలు ఉండవని ఆయన వెల్లడించారు. సాధారణ దర్శనాలకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టినట్లు వివరించారు. ఈ క్రమంలో వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. దేవాదాయశాఖ కమిషనర్ సత్యనారాయణ, దసరా ఉత్సవాల నిర్వహణ ప్రత్యేక అధికారి రామచంద్రమోహన్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా.జీ.సృజన, నగర పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖరబాబు, దుర్గగుడి ఈవో కె.ఎస్.రామారావు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
Category
🗞
News