ధరణితో సరికొత్త విప్లవం అన్నారు - కొత్త సమస్యలు తెచ్చిపెట్టారు : మంత్రి పొంగులేటి

  • 26 days ago
Minister Ponguleti Srinivas Reddy on Dharani Portal : గత బీఆర్ఎస్ తీసుకొచ్చిన ధరణి పోర్టల్ లోపభూయిష్టంగా ఉందని ఎక్కడ చూసినా సమస్యలే ఉన్నాయని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. భూసంస్కరణల్లో విప్లవాత్మక మార్పులు తెస్తామని చెప్పి తీసుకొచ్చిన ఈ పోర్టల్​ వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ధరణి తెచ్చిన సమస్యలకు పేదరైతులు చెప్పలరిగేలా అధికారుల చుట్టూ తిరిగాల్సి వస్తోందని పేర్కొన్నారు. ఈ పోర్టల్ పేరుతో అప్పటి పెద్దాయన ప్రజలను దగా చేశారని ఆరోపించారు. ధరణి పేరుతో కొందరికి భూములు కట్టబెట్టేందుకు కుట్రలు చేశారని మండిపడ్డారు. సాదాబైనామాల పేరుతో ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారన్న ఆయన ఇప్పటివరకు 9 లక్షల దరఖాస్తులు వచ్చాయని వెల్లడించారు.

Recommended