పవర్ వార్ : అసెంబ్లీ వేదికగా విద్యుత్ రంగంపై అధికార, విపక్షాల మధ్య హోరాహోరీ చర్చ
Electricity Debate in Assembly 2024 : బడ్జెట్ పద్దుల్లో భాగంగా విద్యుత్ రంగంపై శాసనసభలో వాడీవేడీ చర్చ జరిగింది. బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకొంది. కరెంట్ మీటర్లు, విచారణ కమిషన్, విద్యుత్ కేంద్రాల నిర్మాణం, తదితర అంశాలపై అధికార, విపక్షాలు పరస్పరం విమర్శలు గుప్పించుకున్నాయి. బీఆర్ఎస్ నేతల కోరిక మేరకే విచారణ కమిషన్ వేశామన్న సీఎం రేవంత్రెడ్డి, దోపిడీ బయటపడుతుందనే కోర్టు కెళ్లారని ధ్వజమెత్తారు