దొంగలుగా చిత్రీకరించి జైలుకు పంపారు: జేసీ

  • 9 days ago
బస్సుల కొనుగోలు విషయంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం తమను దొంగలుగా చిత్రీకరించి జైలుకు పంపారని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పది రోజుల్లో అధికారులు తనకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. లేకుంటే ఎస్పీ కార్యాలయం, డీటీసీ ఆఫీస్‌ ముందు తాను, తన కుటుంబ సభ్యులు నిరాహార దీక్ష చేస్తామని జేసీ ప్రభాకర్‌ రెడ్డి హెచ్చరించారు.