శపథం నెరవేర్చుకున్న రాజధాని మహిళలు

  • 3 months ago
రాజధాని అమరావతి ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన మహిళలు చంద్రబాబు గెలిస్తే మొక్కులు చెల్లించుకుంటామని శపథం చేశారు. వాటిని ఇప్పుడు నెరవేర్చుకున్నారు. రాజధాని గ్రామాల నుంచి పాదయాత్రగా తరలివచ్చిన మహిళలు, రైతులు కనకదుర్గమ్మకు చీర, సారె, పొంగళ్లు సమర్పించారు. కూటమి ప్రభుత్వంలో రాజధానితో పాటు రాష్ట్రాభివృద్ధి పరుగులు తీస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

Category

🗞
News

Recommended