'గోవు ఘోష విను గోవిందా' పేరిట బీజేపీ కిసాన్​మోర్చా

  • 4 hours ago
BJP Kisan Morcha Cleaning Temples due to Tirumala Laddu Issue : 'గోవు ఘోష విను గోవిందా' పేరిట బీజేపీ కిసాన్​మోర్చా గోమాత పూజలు చేపట్టింది. పరిశుద్ధ కార్యక్రమాల పేరుతో శనివారం నాడు వైఎస్సార్సీపీ నేతలు వెళ్లిన దేవాలయాలను వారు పునఃశుద్ధి చేశారు. ఇందులో భాగంగా శ్రీకాకుళం జిల్లాలోని బీజేపీ నేతలు శివాలయంలోకి ఆవును తీసుకెళ్లి పూజలు చేశారు. డిప్యూటీ సీఎం చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతుగా జనసేన నేతలు శాంతి హోమం చేయించారు. లడ్డూను అపవిత్రం చేసిందే కాక తప్పును కప్పిపుచ్చుకునేందుకు దేవాలయాలకు వచ్చి నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు.

Category

🗞
News

Recommended