MSME Policy
NEW MSME Policy In Telangana : ఒక రాష్ట్రాభివృద్ధిలో పారిశ్రామిక రంగానిది ఎంతో కీలక పాత్ర. ఈ రంగం ద్వారా లక్షలాది మందికి ఉపాధి కలుగుతోంది. కేవలం భారీ పరిశ్రమల ద్వారానే కాకుండా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల మీద ఆధారపడి ఎంతో మంది ఉపాధి పొందుతున్నారు. ఎమ్ఎస్ఎమ్ఈలను మరింత ప్రోత్సహించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం నూతన విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. గతంలో ఉన్న వాటికంటే అదనంగా ప్రోత్సాహకాలు ప్రకటించడం ద్వారా పారిశ్రామికవేత్తలను ఆకట్టుకోవాలనేది రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశం. భూమిని తక్కువ ధరకు ఇవ్వడం దగ్గరి నుంచి రుణాలు సులభంగా అందేలా చూడటం పారిశ్రామిక వేత్తలను ఆకట్టుకునేలా పలు విధానాలు ఎమ్ఎస్ఎమ్ఈ నూతన విధానంలో ఉన్నాయి.
Category
🗞
News