ట్యాంక్‌బండ్‌లో నీటిని కొబ్బరి నీళ్లు చేస్తానని నేనెప్పుడూ చెప్పలేదు : రేవంత్ రెడ్డి

  • 28 days ago
CM Revanth Reddy At Assembly : ట్యాంక్‌బండ్‌లోని నీటిని కొబ్బరి నీళ్లు చేస్తానని తానెప్పుడూ చెప్పలేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. శాసనసభలో ద్రవ్యవినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా కేటీఆర్​కు, సీఎం రేవంత్​కు మధ్య వాడివేడిగా వాగ్వాదం సాగింది. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ, బతుకమ్మ చీరల కాంట్రాక్టు బినామీలకు ఇచ్చి సూరత్‌ నుంచి తీసుకువచ్చారా? లేదా చెప్పాలని డిమాండ్ చేశారు. బతుకమ్మ చీరల విషయంలో ఆడబిడ్డలు తిరుగుబాటు చేశారా? లేదా? అని ప్రశ్నించారు. ఎయిర్‌పోర్టుకు ఎంఎంటీఎస్‌ను నిర్మిస్తామని కేంద్రం అంటే తిరస్కరించింది కేసీఆర్‌ ప్రభుత్వం కాదా? అని అడిగారు.

Recommended