'కీలక ప్రాజెక్టులపై కలిసి నడుద్దాం'- ఏపీ, తెలంగాణ

  • 14 days ago
Chandrababu Naidu and Revanth Reddy Meeting: కీలక ప్రాజెక్టులపై కలిసి పనిచేయాలని ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు నిర్ణయించాయి. ఇరురాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీలో చర్చలు సామరస్యపూర్వకంగా జరిగాయి. సమస్యలపై తరచూ మాట్లాడుకుంటూ వీలైనంత వేగంగా పరిష్కరించుకోవాలని ముఖ్యమంత్రులు నిర్ణయించారు. ముఖ్యమంత్రులిద్దరూ ఇదే సానుకూల దృక్పథం, పరస్పర సహకారంతో ముందుకెళితే రెండు రాష్ట్రాల మధ్య పెండింగ్‌లో ఉన్న అంశాలన్నీ సాధ్యమైనంత త్వరలోనే పరిష్కారమవుతాయని ఉభయ రాష్ట్రాల ప్రజలకూ మేలు జరుగుతుందన్న అభిప్రాయం సమావేశంలో పాల్గొన్న మంత్రులు, అధికారుల్లో వ్యక్తమైంది.

Recommended