ప్రతీ విద్యార్థికి రూ.15వేలు ఇస్తాం: మంత్రి నిమ్మల

  • 2 months ago
Minister Nimmala on Talliki Vandanam Scheme: ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ప్రతి విద్యార్థికీ 15 వేలు తల్లికి వందనం పేరిట ఇస్తామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఈ పథకానికి త్వరలోనే విధివిధానాలు ప్రకటిస్తామని తెలిపారు. అబద్దాలకు, అసత్యాలకు రాష్ట్రంతో పాటు అంతర్జాతీయ స్థాయిలో వైఎస్సార్సీపీ పేటెంట్ పొందిందని ఎద్దేవా చేశారు. ఆమ్మఒడి పథకానికి తూట్లు పొడిచిన వైఎస్సార్సీపీ నేతలకు తల్లికి వందనం గురించి మాట్లాడే నైతిక అర్హత లేదని దుయ్యబట్టారు.

Recommended