ఇంజినీరింగ్ స్టూడెంట్స్కు గుడ్ న్యూస్
CM Revanth Reddy meet with Management of Engineering Colleges : ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు లేకుండా చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఇంజినీరింగ్ కళాశాలకు సహాయం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం చెప్పారు. నిరుద్యోగులను తయారు చేసే పరిశ్రమలుగా కళాశాలలు ఉండకూడని అన్నారు. జేఎన్టీయూలో ఇంజినీరింగ్ కాలేజీల యాజమాన్యాలతో సీఎం సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో నాణ్యమైన ఇంజినీరింగ్ విద్య అనే కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు, జేఎన్టీయూ వీసీ బుర్రా వెంకటేశంతో పాటు పలువురు ఉన్నతాధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.