ఇంజినీరింగ్​ స్టూడెంట్స్​కు గుడ్​ న్యూస్

  • 2 months ago
CM Revanth Reddy meet with Management of Engineering Colleges : ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి ఫీజు రీయింబర్స్​మెంట్​ బకాయిలు లేకుండా చేస్తానని సీఎం రేవంత్​ రెడ్డి హామీ ఇచ్చారు. ఇంజినీరింగ్​ కళాశాలకు సహాయం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం చెప్పారు. నిరుద్యోగులను తయారు చేసే పరిశ్రమలుగా కళాశాలలు ఉండకూడని అన్నారు. జేఎన్​టీయూలో ఇంజినీరింగ్​ కాలేజీల యాజమాన్యాలతో సీఎం సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో నాణ్యమైన ఇంజినీరింగ్​ విద్య అనే కార్యక్రమంలో సీఎం రేవంత్​ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్​ బాబు, జేఎన్​టీయూ వీసీ బుర్రా వెంకటేశంతో పాటు పలువురు ఉన్నతాధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Recommended