రాబోయే రోజుల్లో రంగారెడ్డి జిల్లాకు మహర్దశ : సీఎం

  • last month
cm revanth rangareddy tour : ఎక్కడా లేనివిధంగా రూ.100 కోట్ల పలికిన భూమి రంగారెడ్డి జిల్లాలోనే ఉందని సీఎం రేవంత్‌ హర్షం వ్యక్తం చేశారు. 360 కిలోమీటర్ల మేర రీజినల్‌ రింగ్‌ రోడ్డు నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. రీజినల్‌ రింగ్‌ రోడ్డు వల్ల రంగారెడ్డి జిల్లా భూములు బంగారం అవుతాయన్నారు. తొందరలో హయత్‌నగర్‌కు మెట్రో రాబోతుందని వెల్లడించారు. మెట్రో రైలు విస్తరణ సంబంధించి అన్ని ప్రణాళికలు పూర్తి అయ్యాయని చెప్పారు. సైబరాబాద్‌ను న్యూయార్క్‌తో పోటీ పడేలా తీర్చిదిద్దుదామని తెలిపారు. రామోజీ ఫిల్మ్‌సిటీ దేశంలో ఉన్న అన్ని సినిమాలకు ఉపయోగపడుతుందన్నారు. రాచకొండ ప్రాంతం ఒకప్పుడు కంటే అద్భుతంగా కనిపించిందన్నారు. రాచకొండ ప్రాంతాన్ని ఒక అద్భుతమైన ఫిల్మ్‌ ఇండస్ట్రీగా మారుస్తామని చెప్పుకొచ్చారు. రాబోయే రోజుల్లో రంగారెడ్డి జిల్లాకు మహర్దశ వస్తుందని సీఎం రేవంత్‌ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.

Recommended