భర్తను హత్య చేసిన స్వాతికి కర్మకాండలు, గుండు గీయించుకుని ! | Oneindia Telugu

  • 7 years ago
The family members of accused in Sudhakar Reddy case Swathi and Rajesh family members have decided to keep away from them.

సుధాకర్ రెడ్డిని కిరాతకంగా హత్య చేసిన స్వాతి, రాజేష్ విషయాల్లో వారి తల్లిదండ్రులు తీసుకున్న వైఖరి ప్రశంసలు అందుకుంటోంది. ఈ విషయంలో వారు తమ సంస్కారాన్ని ప్రదర్శించారనే మాట వినిపిస్తోంది. స్వాతి, ఆమె ప్రియుడు రాజేష్ సుధాకర్ రెడ్డిని పథకం ప్రకారం చంపేసి ఆడిన డ్రామా గుట్టును పోలీసులు బయటపెట్టారు. అయితే, వారి తల్లిదండ్రులు కన్న మమకారంతో వారిని వెనకేసుకొస్తున్నారా అంటే లేదనే చెప్పాల్సి ఉంటుంది.
స్వాతి తండ్రి ఆమె తన కూతురు అనే ప్రేమను కూడా చంపేసుకున్నాడు. తల ఎత్తుకుని తిరగకుండా చేసిందని భావిస్తున్నాడు. అసాధారణ రీతిలో ఆమెకు అంత్యక్రియలు జరిపించాదడు. గుండు గీయించుకున్నాడు. పిల్లలకు అండగా నిలబడాలని నిర్ణయం తీసుకున్నాడు. రాజేష్ కుటుంబ సభ్యులు అతని కోసం కొన్ని రోజులు అరా తీశారు. ఫోన్ స్విచ్ఛాఫ్‌లో ఉండడంతో ఆందోళనకు గురయ్యారు. వాస్తవం తెలిసి వారు నివ్వెరపోయారు. రాజేష్ తండ్రి కొద్ది నెలల క్రితమే మరణించాడు. తల్లి బాధ వర్ణనాతీతంగా ఉంది. అతని బెయిల్ కోసం ప్రయత్నం చేయకూడదని నిర్ణయం తీసుకుంది.

Category

🗞
News

Recommended