బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి కామెంట్స్
Alleti Maheshwar Reddy Fires on CM Revanth Reddy : సీఎం రేవంత్రెడ్డి ఏడు నెలల పాలనలోని చీకటి జీవోలపై ఈడీ, సీబీఐలతో విచారణ జరిపించాలని బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. అసెంబ్లీ మీడియా హాల్లో మాట్లాడిన ఏలేటి గత ప్రభుత్వం మాదిరిగానే చీకటి ఒప్పందాలు, చీకటి జీవోలతో ప్రస్థుత సర్కార్ అవినీతిలో కూరుకుపోయిందని విమర్శించారు. అమృత్ పథకం ద్వారా కేంద్రం ఇచ్చిన 3 వేల కోట్ల నిధులలో దాదాపు 12వందల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు.