టీచర్ల బదిలీల వివాదం.. మంత్రిపై చేయిచేసుకున్న మరో అమాత్యుడు!

  • 6 years ago
అసెంబ్లీ సమావేశాల్లో గొడవలు జరగడం సాధారణమే కానీ, ఏకంగా ఓ మంత్రి ఇంటికి వెళ్లిన మరో మంత్రి.. ఆయనపై చేయి చేసుకోవడం ఇప్పుడు రాజస్థాన్ రాష్ట్రంలో సంచలనంగా మారింది. ఇద్దరు ఒకరిపై ఒకరుదు దాడి చేసుకున్నారు. దీంతో ఈ ఘటన దేశ వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది. ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. శిఖర్ జిల్లా ఖండేలా నియోజకవర్గంలోని ప్రభుత్వ ఉపాధ్యాయుల బదిలీలు పారదర్శకంగా జరగడం లేదనే ఆరోపణలు రావడంతో ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే, రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి బన్షీధర్ బజియా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ విషయంపై విద్యాశాఖ మంత్రి వసుదేవ్‌ దేవ్నానీతో చర్చించేందుకు శుక్రవారం ఆయన ఇంటికి వెళ్లారు బన్షీధర్ బజియా . ఈ క్రమంలో ఇద్దరు మంత్రుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో ఆగ్రహానికి గురై బజియా.. మంత్రి దేవ్నానీపై చేయిచేసుకున్నట్లు స్థానిక మీడియా కథనాలు వెల్లడించింది. ఈ ఘటన వివాదాస్పదంగా మారడంతో రాష్ట్ర బీజేపీ ఇంఛార్జ్‌ అవినాశ్‌ రాయ్‌ ఇద్దరు మంత్రులను పిలిపించి మాట్లాడినట్లు సమాచారం. కాగా, మంత్రి వసుదేవ్‌పై చేయి చేసుకున్నట్లు వస్తున్న వార్తలను బజియా తోసిపుచ్చారు. కావాలనే తనపై వదంతులు సృష్టిస్తున్నారని మండిపడ్డారు.
#rajasthan
#ministers
#battle
#Shame
#Vasundhararaje

Category

🗞
News

Recommended