Telangana Govt Submitted Affidavit to Supreme Court : కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాలు ప్రభుత్వానిదేనని, అటవీ భూమి కాదని సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. వివిధ ప్రభుత్వ అవసరాల కోసం బుల్డోజర్ల ద్వారా భూమిని చదును చేయడం వివాదాస్పదంగా మారడంతో జస్టిస్ బీఆర్ గవాయి నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆ కేసును సుమోటోగా తీసుకొని అక్కడి కార్యకలాపాలపై స్టే విధించడం సహా ఐదు అంశాలకు సమాధానమిస్తూ ఈ నెల 16లోపు అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది.
Category
🗞
News