స్పీకర్ అయ్యన్నపాత్రుడు అసెంబ్లీలో రూలింగ్ ఇచ్చారు. ప్రతిపక్ష హోదా కావాలంటూ జగన్ రాసిన లేఖపై మాట్లాడిన స్పీకర్ అయ్యన్న...తన లేఖలో ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదంటూ జగన్ అవాకులు చెవాకులు పేలారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై ఈ తరహా వ్యాఖ్యలతో లేఖలు రాయటం అంటే అది సభా ధిక్కరణకు కిందకే వస్తుందన్న అయ్యపాత్రుడు..జగన్ ప్రతిపక్ష కావటానికి ప్రజలు అనుమతి లేదన్నారు. ప్రజాస్వామ్యం లో ప్రజలే దేవుళ్లన్న అయ్యన్న...అసెంబ్లీ దేవాలయం అన్నారు. స్పీకర్ పూజారి పాత్రను పోషిస్తాడని..దేవుళ్ల అనుమతి లేకుండా ఇక్కడ ఎవరికీ ఏ అధికారం రాదన్నారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు. ఈమేరకు స్పీకర్ సందేశం తర్వాత...మంత్రి నారా లోకేశ్ కూడా స్పందించారు.
Category
🗞
News