వారానికి 2 రోజులు 'మంత్రులతో ప్రజల ముఖాముఖి'
Ministers Meet with People : తెలంగాణ కాంగ్రెస్ సరికొత్త సంప్రదాయానికి నాంది పలుకుతోంది. ఈ నెల 25 నుంచి గాంధీభవన్లో 'మంత్రులతో ప్రజల ముఖాముఖి' కార్యక్రమం ప్రారంభం కానుంది. వారంలో రెండు రోజులు బుధ, శుక్రవారాల్లో మూడు గంటల పాటు గాంధీభవన్లో మంత్రులు అందుబాటులో ఉండేటట్లు పీసీసీ కార్యాచరణ సిద్ధం చేసింది. కొత్తగా నియమితులైన పీసీసీ అధ్యక్షులు మహేశ్ కుమార్ గౌడ్ ప్రభుత్వానికి, పార్టీకి మధ్య అనుసంధానంగా వ్యవహరిస్తూ కాంగ్రెస్ను బలోపేతం చేసే దిశలో ముందుకు వెళ్లాలని యోచిస్తున్నారు.
Category
🗞
News