అతి విశ్వాసం వల్లనే బీజేపీ ఓటమి : మోదీకి దీటుగా ‘మహా’కూటమి సన్నాహాలు

  • 6 years ago
A day after the Samajwadi Party clinched big wins in Lok Sabha bypolls in Uttar Pradesh, talks of forging a grand alliance ahead of the 2019 elections have picked up steam. Nationalist Congress Party (NCP) MP Majeed Memom said that the wins in Uttar Pradesh and Bihar have given boost to the efforts of forging a grand alliance by the Opposition. "Sonia Gandhi and Sharad Pawar are working together to forge a grand alliance," the NCP leader said.

జాతీయ స్థాయిలో బీజేపీ నాయకుడు నరేంద్రమోదీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మహా కూటమి ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయా? అన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఆ దిశగా కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు అడుగులు వేస్తున్నాయి. ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన సమాజ్‌వాది పార్టీ ఏడాది తిరగకుండానే లోక్‌సభ ఉప ఎన్నికల్లో భారీ విజయాలు నమోదు చేయడంతో వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి బీజేపీని ఓడించేందుకు మహాకూటమి ఏర్పడవచ్చన్న ఊహాగానాలు ఊపందుకుంటున్నాయి.
జాతీయ స్థాయిలో మహా కూటమి ఆశలకనుగుణంగానే యూపీ, బీహార్ ఉప ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే వివిధ పార్టీల నేతల మధ్య సంప్రదింపులు, చర్చలు ప్రారంభమయ్యాయి. ఉప ఎన్నికల ఫలితాలు మహా కూటమి ఏర్పాటుకు విపక్ష పార్టీల్లో నైతిక స్థయిర్యాన్ని కల్పించాయని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)ఎంపీ మజీద్ మెమన్ పేర్కొన్నారు.
మహాకూటమి ఏర్పాటు దిశగా కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌పవార్ ఇప్పటికే చర్చలు ప్రారంభించారని ఎన్సీపీ ఎంపీ మజీద్ మెమన్ వెల్లడించారు.
ఈ నెల 28న రాహుల్ తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీతో ఢిల్లీలో సమావేశం కానున్నారు. మహాకూటమి వాస్తవ రూపం దాల్చుతున్నది అని నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) నాయకుడు, జమ్ముకశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా పేర్కొన్నారు.
మహాకూటమి వల్ల ఎటువంటి ఫలితాలు వెలువడుతాయో యూపీలో స్పష్టమైందని ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు. సోనియాగాంధీ ఇటీవల ఢిల్లీలో ఇచ్చిన విందుకు ఎన్సీ అధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా హాజరయ్యారు. 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రతిపక్ష పార్టీల కూటమి ఏర్పాటు కోసమే ఆ విందు నిర్వహించినట్టు తెలుస్తున్నది.
మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ మద్దతుతో రెండు లోక్‌సభ స్థానాలను గెలుచుకున్న సమాజ్‌వాదీ పార్టీ ఇక ముందు కూడా ఆ పొత్తును కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతాన్ని మరచిపోవాలని, బీఎస్పీతో తమ సంబంధాలు సానుకూలంగా ఉన్నాయని ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ వ్యాఖ్యానించడం ఈ ఊహాగానాలకు ఊతమిస్తున్నది.