విజయనగరం జిల్లాలో భారీ వర్షాలు

  • last week
Floods in Vizianagaram District: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలో విస్తారంగా వర్షం కురుస్తోంది. మడ్డువలస జలాశయం 6 ప్రధాన గేట్లు ఎత్తి సుమారు 16 వేల క్యూసెక్కుల నీటిని నాగావళి నదిలోకి అధికారులు వదిలారు. వరి చెరుకు పొలాలు నీటిలో మునిగిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి నష్ట పరిహారం చెల్లించాలని రైతులు కోరుతున్నారు.

Category

🗞
News

Recommended