కొలిక్కి వస్తున్న మదనపల్లె సబ్‌కలెక్టరేట్‌ కేసు

  • last month
Madanapalle Sub Collector office Case: మదనపల్లె సబ్‌కలెక్టర్ కార్యాలంలో కీలక దస్త్రాలు తగులబెట్టింది రెవెన్యూ అధికారులేనని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఆర్డీవో హరిప్రసాద్‌, సీనియర్ అసిస్టెంట్‌ గౌతమ్‌ ఈ చర్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. ఆర్డీవో హరిప్రసాద్ పిలిపిస్తేనే, పలమనేరు నుంచి వచ్చి దస్త్రాలన్నీ క్లియర్ చేశానని ఇప్పటికే సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ అంగీకరించినట్లు తెలిసింది. అయితే ఎవరి కోసం ఈ పనిచేశారో గుట్టు వీడాలి. మరోవైపు పరారీలో ఉన్న పెద్దిరెడ్డి ప్రధాన అనుచరుడు మాధవరెడ్డి కోసం విస్తృతంగా పోలీసులు గాలిస్తున్నారు.

Recommended