రాష్ట్రంలో బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్లో విలీనం చేసుకునే దిశలో రాష్ట్ర కాంగ్రెస్ ముందుకు వెళ్తోంది. లోక్సభ ఎన్నికలు ముగిసిన తర్వాత పోచారం శ్రీనివాస్ రెడ్డితో మొదలైన చేరికలు కొనసాగుతాయని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. బీఆర్ఎస్ నుంచి మరో 20 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి వచ్చే అవకాశం ఉందని హస్తం పార్టీ అంచనా వేస్తోంది. మరోవైపు కాంగ్రెస్లో చేరికలపై బీఆర్ఎస్ నేతలు భగ్గుమంటున్నారు.