Does the Central Government research on the forest wealth of Andhra Pradesh? ...especially the red sandal and sri sandals tree treasure?...The answer is yes...
#Andhrapradesh
#Chittoor
#CentralGovernment
#RedSandal
#SandalWood
ఆంధ్రప్రదేశ్ లోని అటవీ సంపదపై కేంద్రం పరిశోధనలు చేస్తోందా?...ముఖ్యంగా ఇక్కడి ఎర్రచందనం, శ్రీగంధం వృక్ష సంపద గురించి క్షుణ్నంగా ఆరా తీస్తోందా?...అంటే అవుననే ఈ పశ్నకు సమాధానం వచ్చింది...
అయితే కేంద్రం ఏ కారణంతో ఈ వివరాలు తీస్తోంది?...ఎప్పట్నుంచి తీస్తోంది?...అసలెందుకు తీస్తోంది?...అనే అనుమానాలన్నీ వచ్చేస్తున్నాయి కదా! అంతేకాదు ఎపి నుంచి ఎర్ర చందనం స్మగ్లింగ్ గురించి ఎవరైనా కేంద్రానికి ఫిర్యాదు చేశారా?...అందుకే కేంద్రం ఇలా చేస్తోందా? అనే డౌట్ కూడా వచ్చేసింది కదా!...ఈ ప్రశ్నలు అన్నింటికీ సమాధానం కావాలంటే చదివేయండి మరి....
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అడవుల్లో వృక్ష సంపద పరిస్థితి ఏంటి?...ఎలా ఉంది?...ఇక్కడ అత్యంత విలువైన అటవీ సంపద సురక్షితంగానే ఉందా?...అనే విషయాలపై కేంద్రం పరిశోధన చేస్తున్న విషయం వాస్తవం. అంతేకాదు ఈ రీసెర్చ్ ఏదో హడావుడిగా మొదలు పెట్టేసి ముగించిన బాపతు కూడా కాదు...అలాగే ఈ రీసెర్చి చేస్తోంది కూడా ఆషామాషీ సంస్థ కాదు. బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా శాస్త్రవేత్తలు సుమారు ఏడాది క్రితం నుంచి ఎపిలోని అడవుల్లో తమ పరిశోధనలు చేస్తూ వచ్చారు. రాష్ట్రంలో అంతరించిపోతున్న విలువైన వృక్షాలను, వృక్షజాతులను ఎలా కాపాడుకోవాలనే అంశాల మీద బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా శాస్త్రవేత్తలు ఏడాది నుంచి చేస్తున్న పరిశోధనలు మే 8 మంగళవారంతో పూర్తయినట్లు తెలిసింది.
ప్రపంచంలో ఎక్కడాలేని అత్యంత విలువైన ఎర్రచందనం, శ్రీగంధం వృక్ష సంపద ఎపిలోని నల్లమల, శేషాచలం అడవుల్లోనే ఉన్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం ఆ సంపద స్మగ్లర్ల బారినపడి అంతరించిపోయే స్థితికి చేరుకున్న విషయమూ తెలిసిందే. దీంతో ఏ సమస్య గురించి తెలుసుకున్న కేంద్రం పరిష్కారం కోసం కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియాను సంప్రదించింది. ఆంధ్రప్రదేశ్ అడవుల్లోని అరుదైన వృక్షజాతుల స్థితిగతులపై సవివరమైన నివేదిక తమకు అందచేయాలని కోరింది. దీంతో ఈ బాధ్యత చేపట్టిన బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా తమ శాస్త్రవేత్తలు డాక్టర్ జె.స్వామి, డాక్టర్ నాగరాజు ిక్కడినేతృత్వంలో పది మంది నిపుణుల బృందాన్ని రాష్ట్రంలోని వృక్షజాతులపై పరిశోధలకు రంగంలోకి దింపింది.
#Andhrapradesh
#Chittoor
#CentralGovernment
#RedSandal
#SandalWood
ఆంధ్రప్రదేశ్ లోని అటవీ సంపదపై కేంద్రం పరిశోధనలు చేస్తోందా?...ముఖ్యంగా ఇక్కడి ఎర్రచందనం, శ్రీగంధం వృక్ష సంపద గురించి క్షుణ్నంగా ఆరా తీస్తోందా?...అంటే అవుననే ఈ పశ్నకు సమాధానం వచ్చింది...
అయితే కేంద్రం ఏ కారణంతో ఈ వివరాలు తీస్తోంది?...ఎప్పట్నుంచి తీస్తోంది?...అసలెందుకు తీస్తోంది?...అనే అనుమానాలన్నీ వచ్చేస్తున్నాయి కదా! అంతేకాదు ఎపి నుంచి ఎర్ర చందనం స్మగ్లింగ్ గురించి ఎవరైనా కేంద్రానికి ఫిర్యాదు చేశారా?...అందుకే కేంద్రం ఇలా చేస్తోందా? అనే డౌట్ కూడా వచ్చేసింది కదా!...ఈ ప్రశ్నలు అన్నింటికీ సమాధానం కావాలంటే చదివేయండి మరి....
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అడవుల్లో వృక్ష సంపద పరిస్థితి ఏంటి?...ఎలా ఉంది?...ఇక్కడ అత్యంత విలువైన అటవీ సంపద సురక్షితంగానే ఉందా?...అనే విషయాలపై కేంద్రం పరిశోధన చేస్తున్న విషయం వాస్తవం. అంతేకాదు ఈ రీసెర్చ్ ఏదో హడావుడిగా మొదలు పెట్టేసి ముగించిన బాపతు కూడా కాదు...అలాగే ఈ రీసెర్చి చేస్తోంది కూడా ఆషామాషీ సంస్థ కాదు. బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా శాస్త్రవేత్తలు సుమారు ఏడాది క్రితం నుంచి ఎపిలోని అడవుల్లో తమ పరిశోధనలు చేస్తూ వచ్చారు. రాష్ట్రంలో అంతరించిపోతున్న విలువైన వృక్షాలను, వృక్షజాతులను ఎలా కాపాడుకోవాలనే అంశాల మీద బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా శాస్త్రవేత్తలు ఏడాది నుంచి చేస్తున్న పరిశోధనలు మే 8 మంగళవారంతో పూర్తయినట్లు తెలిసింది.
ప్రపంచంలో ఎక్కడాలేని అత్యంత విలువైన ఎర్రచందనం, శ్రీగంధం వృక్ష సంపద ఎపిలోని నల్లమల, శేషాచలం అడవుల్లోనే ఉన్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం ఆ సంపద స్మగ్లర్ల బారినపడి అంతరించిపోయే స్థితికి చేరుకున్న విషయమూ తెలిసిందే. దీంతో ఏ సమస్య గురించి తెలుసుకున్న కేంద్రం పరిష్కారం కోసం కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియాను సంప్రదించింది. ఆంధ్రప్రదేశ్ అడవుల్లోని అరుదైన వృక్షజాతుల స్థితిగతులపై సవివరమైన నివేదిక తమకు అందచేయాలని కోరింది. దీంతో ఈ బాధ్యత చేపట్టిన బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా తమ శాస్త్రవేత్తలు డాక్టర్ జె.స్వామి, డాక్టర్ నాగరాజు ిక్కడినేతృత్వంలో పది మంది నిపుణుల బృందాన్ని రాష్ట్రంలోని వృక్షజాతులపై పరిశోధలకు రంగంలోకి దింపింది.
Category
🗞
News