పవన్! కేసీఆర్ వేలకోట్ల దోపిడీకి నువ్వు బ్రాండ్ అంబాసిడర్వా ?
Congress leader and Kodangal MLA Revanth Reddy takes on KCR and suggested Jana Sena chief Pawan Kalyan.
జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ను ఉపయోగించుకొని ముఖ్యమంత్రి కేసీఆర్ తన దోపిడీని దుర్వినియోగం చేసే ప్రయత్నాలు చేస్తున్నారని కాంగ్రెస్ నేత, కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి మంగళవారం ఆరోపించారు. ఆయన గాంధీ భవన్లో విలేకరులతో మాట్లాడారు.
పవన్ కళ్యాణ్ సీఎం కేసీఆర్ దుర్మార్గాన్ని గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. పవన్ ద్వారా ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. పవన్కు తాను ఓ మాట స్పష్టంగా చెప్పదలుచుకున్నానని, కేసీఆర్ పాల్పడుతున్న వేల కోట్ల దుర్వినియోగానికి మీరు బ్రాండ్ అంబాసిడర్గా ఉంటారా అని ప్రశ్నించారు.
మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి విద్యుత్ ఇబ్బందులపై మాట్లాడింది వాస్తవమని రేవంత్ రెడ్డి చెప్పారు. విద్యుత్ సంస్థల విభజన జనాభా ప్రాతిపదికన జరగలేదన్నారు. విభజన నేపథ్యంలో తెలంగాణకు ఎక్కువ విద్యుత్ వచ్చిందని చెప్పారు.
తెలంగాణ రాష్ట్రం విడిపోయినప్పుడు 6,573 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం తెలంగాణకు ఉందని, కానీ అది సరిపోలేదని రేవంత్ చెప్పారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు 2,050 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టు పనులను ప్రారంభించిందని చెప్పారు. ఆ సంస్థలు ఇప్పుడు ఉత్పత్తి ప్రారంభించడంతో విద్యుత్ ఇబ్బందులు లేవన్నారు.కేంద్రం 'ఉదయ్' స్కీం కింద తెలంగాణకు కూడా గృహ అవసరాలకు అవసరమైన అదనపు విద్యుత్ ఇస్తోందన్నారు. ఇది కాకుండా టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు వచ్చిన ప్రయివేటు సంస్థలు ఇప్పుడు ప్రారంభమయ్యాయని, దీంతో విద్యుత్ ఇబ్బందులు లేకుండా పోయాయని చెప్పారు.కేంద్రం ఉదయ్ పేరుతో 19 రాష్ట్రాల్లో విద్యుత్ ఇస్తోందని రేవంత్ రెడ్డి అన్నారు. అందులో తెలంగాణకు వచ్చిందన్నారు. విద్యుత్ ఇబ్బందులు లేకపోవడానికి మతలబు ఉందని, అందుకు టీడీపీ, కాంగ్రెస్ హయాంలలో ఏర్పాటు చేసిన సంస్థలు ఉత్పత్తి ప్రారంభించడం, కేంద్రం ఉదయ్ స్కీం, ప్రయివేటు సంస్థలు.. ఇలాంటి ఎన్నో కారణాలు ఉన్నాయని గుర్తించాలన్నారు.
జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ను ఉపయోగించుకొని ముఖ్యమంత్రి కేసీఆర్ తన దోపిడీని దుర్వినియోగం చేసే ప్రయత్నాలు చేస్తున్నారని కాంగ్రెస్ నేత, కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి మంగళవారం ఆరోపించారు. ఆయన గాంధీ భవన్లో విలేకరులతో మాట్లాడారు.
పవన్ కళ్యాణ్ సీఎం కేసీఆర్ దుర్మార్గాన్ని గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. పవన్ ద్వారా ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. పవన్కు తాను ఓ మాట స్పష్టంగా చెప్పదలుచుకున్నానని, కేసీఆర్ పాల్పడుతున్న వేల కోట్ల దుర్వినియోగానికి మీరు బ్రాండ్ అంబాసిడర్గా ఉంటారా అని ప్రశ్నించారు.
మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి విద్యుత్ ఇబ్బందులపై మాట్లాడింది వాస్తవమని రేవంత్ రెడ్డి చెప్పారు. విద్యుత్ సంస్థల విభజన జనాభా ప్రాతిపదికన జరగలేదన్నారు. విభజన నేపథ్యంలో తెలంగాణకు ఎక్కువ విద్యుత్ వచ్చిందని చెప్పారు.
తెలంగాణ రాష్ట్రం విడిపోయినప్పుడు 6,573 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం తెలంగాణకు ఉందని, కానీ అది సరిపోలేదని రేవంత్ చెప్పారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు 2,050 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టు పనులను ప్రారంభించిందని చెప్పారు. ఆ సంస్థలు ఇప్పుడు ఉత్పత్తి ప్రారంభించడంతో విద్యుత్ ఇబ్బందులు లేవన్నారు.కేంద్రం 'ఉదయ్' స్కీం కింద తెలంగాణకు కూడా గృహ అవసరాలకు అవసరమైన అదనపు విద్యుత్ ఇస్తోందన్నారు. ఇది కాకుండా టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు వచ్చిన ప్రయివేటు సంస్థలు ఇప్పుడు ప్రారంభమయ్యాయని, దీంతో విద్యుత్ ఇబ్బందులు లేకుండా పోయాయని చెప్పారు.కేంద్రం ఉదయ్ పేరుతో 19 రాష్ట్రాల్లో విద్యుత్ ఇస్తోందని రేవంత్ రెడ్డి అన్నారు. అందులో తెలంగాణకు వచ్చిందన్నారు. విద్యుత్ ఇబ్బందులు లేకపోవడానికి మతలబు ఉందని, అందుకు టీడీపీ, కాంగ్రెస్ హయాంలలో ఏర్పాటు చేసిన సంస్థలు ఉత్పత్తి ప్రారంభించడం, కేంద్రం ఉదయ్ స్కీం, ప్రయివేటు సంస్థలు.. ఇలాంటి ఎన్నో కారణాలు ఉన్నాయని గుర్తించాలన్నారు.
Category
🗞
News