హస్తం గుర్తు తీసేసి బుల్డోజర్ గుర్తు పెట్టుకోవాలి
BRS leader Harish Rao Meet HYDRA Victims : కాంగ్రెస్ ప్రభుత్వం చేసే పనులకు హస్తం గుర్తు తీసేసి, బుల్డోజర్ గుర్తు పెట్టుకోవాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు సూచించారు. సీఎం రేవంత్ రెడ్డి కట్టుకున్న ఇళ్లు కుంటలో ఉందని, ఆయన తమ్ముడి ఇల్లు ఎఫ్టీఎల్లో ఉందని తెలిపారు. బాధితుల పట్ల ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్లోని మూసీ నది పరీవాహక ప్రాంతాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం పర్యటించింది. ఈ క్రమంలో అక్కడ ఉన్న ఇళ్లను పరిశీలించి, బాధితులకు ధైర్యం చెప్పారు. అనంతరం బాధితులతో బీఆర్ఎస్ బృందం భేటీ అయింది.
Category
🗞
News