హస్తం గుర్తు తీసేసి బుల్డోజర్​ గుర్తు పెట్టుకోవాలి

  • 21 hours ago
BRS leader Harish Rao Meet HYDRA Victims : కాంగ్రెస్​ ప్రభుత్వం చేసే పనులకు హస్తం గుర్తు తీసేసి, బుల్డోజర్​ గుర్తు పెట్టుకోవాలని మాజీ మంత్రి, బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే హరీశ్​ రావు సూచించారు. సీఎం రేవంత్​ రెడ్డి కట్టుకున్న ఇళ్లు కుంటలో ఉందని, ఆయన తమ్ముడి ఇల్లు ఎఫ్​టీఎల్​లో ఉందని తెలిపారు. బాధితుల పట్ల ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్​లోని మూసీ నది పరీవాహక ప్రాంతాల్లో బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం పర్యటించింది. ఈ క్రమంలో అక్కడ ఉన్న ఇళ్లను పరిశీలించి, బాధితులకు ధైర్యం చెప్పారు. అనంతరం బాధితులతో బీఆర్​ఎస్​ బృందం భేటీ అయింది.

Category

🗞
News

Recommended