హత్య కేసును పక్కదారి పట్టించారు - సీఎంకు ఫిర్యాదు
CM Chandrababu Naidu Receiving Requests From People: వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అడ్డగోలుగా వ్యవహరించిన ఐపీఎస్ అధికారుల ఆగడాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. ఆస్తి కోసం కొందరు తమ కుమారుడిని హత్య చేస్తే అప్పటి విజయవాడ సీపీ కాంతిరాణా తాతా, డీసీపీ విశాల్గున్నీలు గుండెపోటు మరణంగా కేసును పక్కదారి పట్టించారని ఓ మహిళ సీఎం చంద్రబాబు వద్ద కన్నీటిపర్యంతమయ్యారు. ఎన్టీఆర్ భవన్లో నిర్వహించిన గ్రీవెన్స్కు హాజరై తన గోడును వెళ్లబోసుకున్నారు. భూకబ్జాలు, భీమా అంశాలపై పలువురు బాధితులు సీఎంకు వినతులు అందించారు.
Category
🗞
News