నైనీ బొగ్గు గనుల తవ్వకానికి ఒడిశా ప్రభుత్వం సహకారం
Deputy CM Bhatti Vikramarka Meet Odisha CM Mohan Charan Majhi : ఒడిశాలోని నైనీ బొగ్గు బ్లాకు ప్రారంభానికి సహకరించాలని ఒడిశా ప్రభుత్వాన్ని తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో బొగ్గు గనుల తవ్వకానికి పూర్తిగా సహకరిస్తామని ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాఝీ హామీ ఇచ్చారు. వెంటనే ఇందుకు సంబంధించిన చర్యలు చేపట్టాలని అధికారులకు ఒడిశా సీఎం ఆదేశాలు జారీ చేశారు. నైని బ్లాక్లో సింగరేణి కార్యకలాపాల ప్రారంభానికి సంబంధించి ఎలాంటి అడ్డంకులు లేకుండా చూడాలని కోరేందుకు శుక్రవారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అధికారుల బృందంతో కలిసి ఒడిశా సీఎంను ఆ రాష్ట్ర సచివాలయంలో కలిశారు. స్థానిక ఎమ్మెల్యే, నిర్వాసితులతో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. ఈ పర్యటనలో ఇంధన శాఖ కార్యదర్శి రోనాల్డ్ రాస్, సింగరేణి సీఎండీ ఎన్.బలరాం పాల్గొన్నారు.
Category
🗞
NewsTranscript
00:00Oh
00:30You
01:00You