నైనీ బొగ్గు గనుల తవ్వకానికి ఒడిశా ప్రభుత్వం సహకారం

  • 2 months ago
Deputy CM Bhatti Vikramarka Meet Odisha CM Mohan Charan Majhi : ఒడిశాలోని నైనీ బొగ్గు బ్లాకు ప్రారంభానికి సహకరించాలని ఒడిశా ప్రభుత్వాన్ని తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో బొగ్గు గనుల తవ్వకానికి పూర్తిగా సహకరిస్తామని ఒడిశా సీఎం మోహన్​ చరణ్​ మాఝీ హామీ ఇచ్చారు. వెంటనే ఇందుకు సంబంధించిన చర్యలు చేపట్టాలని అధికారులకు ఒడిశా సీఎం ఆదేశాలు జారీ చేశారు. నైని బ్లాక్​లో సింగరేణి కార్యకలాపాల ప్రారంభానికి సంబంధించి ఎలాంటి అడ్డంకులు లేకుండా చూడాలని కోరేందుకు శుక్రవారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అధికారుల బృందంతో కలిసి ఒడిశా సీఎంను ఆ రాష్ట్ర సచివాలయంలో కలిశారు. స్థానిక ఎమ్మెల్యే, నిర్వాసితులతో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. ఈ పర్యటనలో ఇంధన శాఖ కార్యదర్శి రోనాల్డ్​ రాస్​, సింగరేణి సీఎండీ ఎన్​.బలరాం పాల్గొన్నారు.

Category

🗞
News
Transcript
00:00Oh
00:30You
01:00You

Recommended