తెలంగాణ అభివృద్ధికి సహకరించండి : సీఎం రేవంత్
- 17 days ago
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హస్తినలో బిజీబిజీగా గడిపారు. ప్రధాని నరేంద్ర మోదీ సహా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. రాష్ట్ర సమస్యలు, విభజన హామీలను వారి దృష్టికి తీసుకెళ్లారు. సింగరేణికి నేరుగా బొగ్గు గనులు కేటాయించడం నుంచి, నవోదయ విద్యాలయాలు, బయ్యారం ఉక్కు పరిశ్రమ అంశాలను ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లామని రేవంత్ రెడ్డి వెల్లడించారు.