ఫోన్ ట్యాపింగ్ - రేవంత్ రెడ్డిపై స్పెషల్ నిఘా

  • yesterday
Tapping Case in Telangana Update : హైకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించిన ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో పోలీసులు కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేశారు. ఈ కేసులో ఎస్​ఐబీ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌రావు కీలకమని పేర్కొన్నారు. రాజకీయ ప్రముఖులు, ఐఏఎస్​లు, ఐపీఎస్​ లు, న్యాయమూర్తులు, పాత్రికేయులు ఇలా ఏ ఒక్కరినీ వదలకుండా అక్రమంగా ఫోన్‌ ట్యాపింగ్ చేసినట్లు వివరించారు. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోందని విదేశాలకు పరారైన ప్రభాకర్‌రావు, శ్రవణ్‌రావును విచారించడం కీలకమని పోలీసులు హైకోర్టుకు వివరించారు. ఇంటర్‌పోల్‌ బ్లూ నోటీస్ ద్వారా వారిద్దరిని దేశానికి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.