కర్నూలు జిల్లాలో కొండచిలువ కలకలం

Telugu Samayam
Telugu Samayam
40 followers
2 years ago
కర్నూలు జిల్లాలో కొండచిలువలు కలకలం రేపుతున్నాయి. గ్రామాల్లో సంచరిస్తూ గ్రామస్తులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. వరుసగా ఏదో ఒక ప్రాంతంలో కొండచిలువలు ప్రత్యక్షమవడంతో ప్రజలు భయాందోళనలో ఉన్నారు. కొండ చిలువలు ఇలా జనావసాల్లో రావడం వారం వ్యవధిలో వరుసగా ఇది రెండోసారి.కర్నూలు జిల్లా ఉయ్యాలవాడ మండలం ఇంజేడు గ్రామంలో కొండచిలువలు సంచరిస్తున్నాయి. వారం వ్యవధిలో రెండు సార్లు గ్రామంలోకి వచ్చాయి కొండ చిలువలు. తాజాగా నిన్న అర్ధరాత్రి మరో కొండచిలువ గ్రామంలోకి వచ్చింది. దీంతో గమనించిన గ్రామస్థులు దానిని పట్టుకొని గ్రామశివారులో వదిలేశారు. గ్రామంలోని ముళ్ళపొదలు, గడ్డివాములను ఆవాసంగా చేసుకున్న కొండచిలువలు ఇక్కడే సంచరిస్తున్నాయి.. దీంతో గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు.

Recommended