పరుగులు పెడుతున్న మారుతి సుజుకి ఆన్‌లైన్ సేల్స్

  • 4 years ago
మారుతి సుజుకి తన ఆన్‌లైన్ సేల్స్ ప్లాట్‌ఫామ్ ద్వారా దేశీయ మార్కెట్లో 2 లక్షలకు పైగా యూనిట్లను విక్రయించింది. మారుతి సుజుకి ప్రకారం, దాని డిజిటల్ ఛానెళ్లలో ఇప్పుడు దేశవ్యాప్తంగా 1,000 డీలర్లు ఉన్నారు. 2019 ఏప్రిల్ నుంచి 2 లక్షల యూనిట్లు ఆన్‌లైన్‌లో అమ్ముడయ్యాయని తెలిపారు. మారుతి సుజుకి 2017 లో ఆన్‌లైన్ బుకింగ్‌లను ప్రారంభించింది

ఏప్రిల్ 2019 నుండి 21 లక్షల మంది కస్టమర్లు ఆన్‌లైన్‌లో కంపెనీ కార్ల గురించి ఆరా తీయగా, 2 లక్షల మంది వినియోగదారులు వాహనాలను కొనుగోలు చేశారు. ఫలితంగా, మారుతి సుజుకి తన ఆన్‌లైన్ ఉనికి ద్వారా దేశీయ మార్కెట్లో మొత్తం అమ్మకాలలో 20% నమోదు చేసింది.

మారుతి సుజుకి ఆన్‌లైన్ సేల్స్ గురించి పూర్తి సమాచారం తెలుసుకోవాలనుకుంటున్నారా.. అయితే ఈ వీడియో చూడండి.

Recommended