మెదక్​ జిల్లాలో రోడ్డు ప్రమాదం - ఐదుగురు దుర్మరణం

  • 3 months ago
Medak Road Accident Today : మెదక్‌ జిల్లాలో రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఘోర రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనల్లో ఆరుగురు మృత్యువాతపడగా, మరో ముగ్గురు తీవ్రగాయాలై ఆసుపత్రి పాలయ్యారు. చేగుంట మండలం వడియారం వద్ద బైపాస్‌ రోడ్డుపై ఇవాళ తెల్లవారుజామున రెండు లారీలు ఢీకొనడంతో ఐదుగురు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ముందు వెళ్తున్న లారీని వెనక నుంచి వచ్చిన మరో లారీ బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని తూప్రాన్ డీఎస్పీ వెంకట్ రెడ్డి తెలిపారు. డ్రైవర్ అజాగ్రత్త వల్లే ప్రమాదం జరిగినట్లు వెల్లడించారు.

Category

🗞
News
Transcript
00:00♪♪♪
00:09♪♪♪
00:17♪♪♪
00:54You

Recommended