భార్యకు వివాహేతర సంబంధం.. మందలించాడని భర్తకు నిప్పు పెట్టి..!

  • 6 years ago
A woman Shanti set fire on her husband for questioning extra marital relation in Guntur distric of Andhra Pradesh.

తన వివాహేతర సంబంధాన్ని ప్రశ్నించిన భర్తపై ఓ భార్య తన కక్ష తీర్చుకుంది. నిద్రపోతున్న భర్తపై పెయింట్ థిన్నర్ పోసి నిప్పంటించింది. ఒళ్లు కాలి తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న భర్తకు సపర్యలు కూడా చేస్తోంది.
భర్త కోలుకోవాలని ప్రార్థిస్తూ కన్నీళ్లు పెట్టుకుంటోంది. ఆమె నిర్వాకంపై బాధితుడి తండ్రి గుంటూరు ప్రభుత్వాస్పత్రి ఔట్‌పోస్టు పోలీసులకు ఫిర్యాద చేశాడు. ఈ ఘటన గుంటూరు జిల్లాలో జరిగింది.
గుంటూరు జిల్లా వేమూరు కొత్తమాలపల్లికి చెందిన కట్టుపల్లి చంటి కి చెరుకుపల్లి మండలం కాపూరుకు చెదిన శాంతితో 9 ఏళ్ల క్రిత పెళ్లయింది.వారికి ముగ్గురు పిల్లలు. రెండేళ్ల క్రితం శాంతి తండ్రి కావూరులో హత్యకు గురయ్యాడు. అప్పటి నుంచి తల్లి కూడా శాంతి వద్దే ఉంటోంది.
తల్లీకూతుళ్లు వేమూరి ప్రభుత్వాస్పత్రిలో స్వీపర్లుగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో శాంతి వివాహేతర సంబంధానికి పూనుకుంది. గురువారం సాయంత్రం ఓ వ్యక్తితో వేమూరు పొలాల్లో ఆమె సన్నిహితంగా ఉండగా చంటి చూశాడు. అక్కడే ఆమెను కొట్టాడు. ఈ విషయం తెలిసి ఊళ్లో పంచాయతీ పెట్టించారు.
పంచాయతీ ముగిసిన తర్వాత చంటి ఇంటికి వచ్చి నిద్రపోయాడు. ఆస్పత్రి డ్యూటీకని చెప్పి వెళ్లి రాత్రి ఒంటి గంటకు శాంతి ఇంటికి వచ్చింది. ఆ సమయం లో ఇంట్లో ఉన్న పెయింట్ థిన్నర్ తీసుకుని చంటిపై పోసి నిప్పంటించింది.

Category

🗞
News

Recommended