History Of Digitization In Telangana : జీర్ణావస్థలో ఉన్న భారతీయ నాటి చరిత్ర, సాహిత్యం భవిష్యత్ తరాలకు అందించే లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తోన్నాయి. ఈ దిశగా రాష్ట సర్కారు ప్రత్యేక దృష్టి సారించింది. మ్యూజియాలు, ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు, ఇతర సంస్థల్లో అమూల్యమైన గ్రంథాలను అధికారులు డిజిటలైజషన్ చేస్తోన్నారు. తాజాగా హైదరాబాద్ స్టేట్ మ్యూజియంలో విలువైన సంపద, మాన్యుస్క్రిప్ట్లు, పెయింటింగ్లు, దస్తావేజులు, ఇతర కాగితపు పత్రాలను ఇరాన్ సంస్థ సహకారంతో డిజిటలైజేషన్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటైన ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది.
Category
🗞
News