Delhi election results 2025 : దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన దిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అనుగుణంగానే ఫలితాల సరళి కన్పిస్తోంది. ఆమ్ ఆద్మీ పార్టీతో పోలిస్తే భాజపా ఆధిక్యంలో దూసుకెళ్తోంది. ఉదయం 9 గంటల వరకు వెలువడిన ఫలితాలను చూస్తుంటే, ఆధిక్యాల్లో బీజేపీ మ్యాజిక్ ఫిగర్ (36)ను దాటేసింది. ప్రస్తుతం కమలం పార్టీ 37 స్థానాల్లో ముందంజలో కొనసాగుతోంది. ఆప్ (AAP) 23 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ ఒక చోటు ముందంజలో కొనసాగుతోంది.
Category
🗞
News