ఫ్యామిలీ డిజిటల్ కార్డులు ప్రారంభించిన CM రేవంత్
CM Revanth on HYDRA : హైడ్రాపై అసెంబ్లీలో చర్చించామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఆనాడు హైడ్రాపై సూచనలు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. మూసీ పరీవాహక ప్రాంత పేదలకు 15 వేల ఇళ్ల కేటాయింపునకు ఆదేశాలు ఇచ్చామన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కంటే ప్రత్యామ్నాయం ఏముందని ప్రసంగించారు. అఖిలపక్షం సమావేశం ఏర్పాటు చేస్తాం, వచ్చి సలహాలు ఇవ్వండని ప్రతిపక్షాలకు సూచించారు. కేటీఆర్, హరీశ్రావు, సబిత కుమారుల ఫామ్హౌస్లు కూల్చాలా? వద్దా? చెప్పండని అడిగారు. ఫామ్హౌస్లు కూల్చుతారనే పేదలను అడ్డుపెట్టుకుని ధర్నాలు, దీక్షలు చేస్తున్నారని మండిపడ్డారు. మూసీని అడ్డం పెట్టుకుని ఎంతకాలం బతుకుతారు, హైదరాబాద్లో మీ భరతం పడతామని హెచ్చరించారు.
Category
🗞
News