పోలీసులకు సీఎం రేవంత్​ వార్నింగ్

  • 6 days ago
CM Revanth Reddy Serious Warning to Police Department : పోలీసుశాఖలో ఇకపై రాజకీయ పోస్టింగులు ఉండవని ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి తెలిపారు. గ్రేటర్​ హైదరాబాద్​ పరిధిలోని మూడు కమిషనరేట్ల అధికారులతో బంజారాహిల్స్​ కమాండ్​ కంట్రోల్​ సెంటర్​లో సమావేశమయ్యారు. డబ్బులిచ్చి పోస్టులు కోసం ప్రయత్నించొద్దని పోలీసులను సీఎం రేవంత్​ హెచ్చరించారు. అలాంటి వారిని ఏసీబీ, విజిలెన్స్​ వెంటాడుతాయని తేల్చిచెప్పారు. రాజకీయాలకంటే నేరాల నియంత్రణపై పూర్తిస్థాయి దృష్టి పెట్టాలని కోరారు. ప్రతిభ, పనిలో సామర్థ్యం ఆధారంగానే పోస్టింగులు ఉంటాయని స్పష్టం చేశారు. ఇందుకు ఉదాహరణ టీజీ నార్కొటిక్​ బ్యూరో డైరెక్టర్​ సందీప్​ శాండిల్యా పదవీకాలం పొడిగింపేనని చెప్పారు.