పోలీసులకు సీఎం రేవంత్ వార్నింగ్
- 6 days ago
CM Revanth Reddy Serious Warning to Police Department : పోలీసుశాఖలో ఇకపై రాజకీయ పోస్టింగులు ఉండవని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మూడు కమిషనరేట్ల అధికారులతో బంజారాహిల్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో సమావేశమయ్యారు. డబ్బులిచ్చి పోస్టులు కోసం ప్రయత్నించొద్దని పోలీసులను సీఎం రేవంత్ హెచ్చరించారు. అలాంటి వారిని ఏసీబీ, విజిలెన్స్ వెంటాడుతాయని తేల్చిచెప్పారు. రాజకీయాలకంటే నేరాల నియంత్రణపై పూర్తిస్థాయి దృష్టి పెట్టాలని కోరారు. ప్రతిభ, పనిలో సామర్థ్యం ఆధారంగానే పోస్టింగులు ఉంటాయని స్పష్టం చేశారు. ఇందుకు ఉదాహరణ టీజీ నార్కొటిక్ బ్యూరో డైరెక్టర్ సందీప్ శాండిల్యా పదవీకాలం పొడిగింపేనని చెప్పారు.