దేశం ఉన్నంత వరకు పీవీ పేరు శాశ్వతం : కేటీఆర్

  • 10 days ago
KTR Tribute to PV Narasimha Rao : మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జీవితచరిత్రను కేంద్రం ఎన్​సీఆర్​టీ పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని బీఆర్ఎస్​ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. పీవీ జయంతి సందర్భంగా తెలంగాణ భవన్‌లో ఆయనకు నివాళి అర్పించారు. భారతదేశం ఉన్నన్ని రోజులు పీవీ పేరును దేశ ప్రజలు గుర్తుంచుకుంటారని కేటీఆర్‌ అన్నారు. గత బీఆర్ఎస్​ హయాంలో పీవీ శతజయంతి ఉత్సవాలు అపురూపంగా నిర్వహించామని చెప్పారు.