మంత్రి ఇల్లీగల్‌ దందాను ప్రశ్నిస్తే లీగల్ నోటీసులు

  • 19 days ago
BRS leader Padi Kaushik Reddy Slams Minister Ponnam : ఫ్లైయాష్ వ్యవహారంలో రవాణా శాఖా మంత్రి పొన్నం ప్రభాకర్ వంద కోట్ల అవినీతికి పాల్పడినట్లు నిరూపితమైందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు. తప్పు చేయకుంటే జూబ్లీహిల్స్‌లోని వెంకటేశ్వర స్వామి గుడిలో ప్రమాణం చేయాలని మంగళవారం రోజున కౌశిక్‌ రెడ్డి మంత్రికి సవాల్‌ విసిరారు.

ఈ క్రమంలోనే ఇవాళ తెలంగాణ భవన్‌ నుంచి కార్యకర్తలతో కలిసి ఆలయానికి వచ్చిన కౌశిక్‌రెడ్డి వేంకటేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం జూబ్లీహిల్స్ వేంకటేశ్వరస్వామి గుడిలో ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ, మంత్రి పొన్నం ప్రభాకర్ ఇల్లీగల్‌ దందాను ప్రశ్నిస్తే తనకు లీగల్ నోటీసులు పంపారని విమర్శించారు. కాంగ్రెస్‌ నేతల సవాల్‌ స్వీకరించి మంగళవారం రోజు కూడా తన స్వగ్రామంలో దేవుని సాక్షిగా ప్రమాణం చేసిట్లు వెల్లడించారు.

Recommended