• 5 years ago
హైదరాబాద్‌కు చెందిన ఎలక్ట్రిక్ టూ-వీలర్ స్టార్టప్ కంపెనీ ఆటమ్ మొబైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ లిమిటెడ్ తమ మొట్టమొదటి ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ "ఆటమ్ 1.0"ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఆటమ్ 1.0 ఎలక్ట్రిక్ బైక్ భారతదేశం అంతటా అందుబాటులో ఉంటుందని, దీని ప్రారంభ ధర కేవలం రూ.50,000 మాత్రమేనని కంపెనీ పేర్కొంది.

ఆటమ్ 1.0 ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ పాతకాలపు కేఫ్-రేసర్ స్టైల్‌లో డిజైన్ చేయబడి ఉంటుంది. దీని డిజైన్ చాలా సింపుల్‌గా, మినిమలిస్టిక్‌గా ఉంటుంది. ఇది టీనేజర్లు, యువకులు వయోజనలు వంటి అన్ని వర్గాల కస్టమర్లను దృష్టిలో ఉంచుకొని అందుబాటు ధరలో ఉండేలా తయారు చేసిన ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్.

Category

🚗
Motor

Recommended