AP Assembly Election 2019 : ఓటుకు రెండు వేలు జనమే అడుగుతున్నారు..! జేసీ || Oneindia Telugu

  • 5 years ago
TDP leader Anantapur MP JC Diwakar Reddy has repeatedly made sensational comments. About the cost of the election, made interesting comments about the voters demand for money. He arrived in Amravati on Monday for a wide range of TDP meetings.
#apelections2019
#JCDiwakarReddy
#tdp
#anantapur
#voters
#apassemblyelections2019
#andhrapradesh
#chandrababunaidu
#ysrcp
#politics

టీడీపీ నేత, అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసారు. ఎన్నికల ఖర్చు గురించి, ఓటర్ల డబ్బు డిమాండ్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ విస్తృతస్థాయి సమావేశం కోసం ఆయన సోమవారం అమరావతి వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ... ఏపీలో మరోసారి టీడీపీనే విజయభేరి మోగిస్తుందని, చంద్రబాబు మళ్లీ సీఎం కావడం తథ్యమని ధీమాగా చెప్పారు. పసుపు-కుంకుమ, పెన్షన్ పథకాలే టీడీపీని కాపాడతాయని తెలిపారు. చంద్రబాబు ఎంత కష్టపడ్డారో ప్రజలకు తెలుసు అని జేసీ వ్యాఖ్యానించారు. చంద్రబాబు దాదాపుగా 120 సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని, ఏపీలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు దేశంలో మరే రాష్ట్రంలోనూ లేవని అన్నారు.