Watch Video : పంజాబ్‌లో విషాదం..జనంపై నుంచి దూసుకెళ్లిన రైలు..!

  • 6 years ago
పంజాబ్ రాష్ట్రంలోని అమృత్‌సర్‌లో శుక్రవారం ఘోర రైలు ప్రమాదం జరిగింది. నవరాత్రి వేడుకల్లో భాగంగా స్థానికులు జోదా ఫటక్ ప్రాంతంలోని రైల్వే ట్రాక్ పైన రావణాసురుడి దహన కార్యక్రమాన్ని నిర్వహించారు. అదే సమయంలో రైలు వచ్చింది. దీంతో పెను ప్రమాదం జరిగింది. రైల్వే ట్రాక్ పైన నిలుచున్న వారి పై నుంచి రైలు దూసుకెళ్లింది. దీంతో 61 మంది ప్రాణాలు కోల్పోయారు. విషయం తెలియగానే పోలీసులు, అధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. రైలు పఠాన్‌కోట్ నుంచి అమృత్‌సర్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
#Amritsar
#Dussehra
#ChouraBazar
#JodaPhatak