తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు..!

  • 6 years ago
Supreme Court gives notice to CEC and Telangana government.
#SupremeCourt
#earlyelections
#earlypolls
#CEC
#Telangana
#andhrapradesh


ముందస్తు ఎన్నికల అంశంలో కేంద్రం ఎన్నికల సంఘం, తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ముందస్తు ఎన్నికలను సవాల్ చేస్తూ సిద్దిపేటకు చెందిన శశాంక్ రెడ్డి అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది.
తెలంగాణలో ముందస్తు వల్ల ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగదని, ఓటర్ల జాబితాలో కూడా అవకతవకలు సరిద్దకుండా ఎన్నికలకు వెళితే ఓటింగ్‌పై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని పిటీషనర్ పేర్కొన్నారు. ముందస్తు ఎన్నికల కారణంగా తెలంగాణలో 2018, జనవరి 1 నాటికి 18 సంవత్సరాలు నిండిన వారిని మాత్రమే ఓటర్లుగా పరిగణిస్తామని ఎన్నికల సంఘం ప్రకటించింది.