వైసిపి బంద్‌ పై యనమల రామకృష్ణుడు మండి పాటు

  • 6 years ago
ప్రత్యేక హోదా కోసం నినాదంతో వైసిపి నేడు చేస్తున్న బంద్‌ విఫలం అయిందని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చెప్పారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసిపి, జగన్,బిజెపిల పై విమర్శల వర్షం కురిపించారు. విభజనతో నష్ట పోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇంకా నష్టపరిచేందుకే వైఎస్ జగన్మోహన్‌రెడ్డి బంద్‌కు పిలుపునిచ్చారని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ధ్వజమెత్తారు. రాష్ట్ర బంద్‌ వల్ల ప్రయోజనం ఏమిటని, ఏ ప్రయోజనంతో బంద్‌కు పిలుపునిచ్చారని వైసిపిని ఆయన ప్రశ్నించారు. వైసిపి మనుగడ కోల్పోతున్న తరుణంలో వారి ఉనికిని కాపాడుకోవడం కోసమే ఈ బంద్‌ చేస్తున్నారని పుల్లారావు ఎద్దేవా చేశారు.

Today's YCP bandh with the slogan for AP special status has been a big failure, said Minister Prathipati Pulla rao.
#YCP
#PrathipatiPullarao

Category

🗞
News

Recommended